15 June, 2026 | 2:58 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

15-06-2026 01:43 PM

బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ ఫీజులు, డొనేషన్లు, అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడంతో పాటు పుస్తకాలు, యూనిఫార్ములు నిర్దిష్ట దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజినపల్లి మండలం వాసి టి ప్రవీణ్ కుమార్ డిఇఓకు ఫిర్యాదు చేశాడు.

కనీస సౌకర్యాల లేమి, అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.