ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సీపీఎం
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేయడానికి సిద్ధమవుతున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ తెలిపారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.
ప్రజల సమస్యలను వినాల్సిన ప్రభుత్వం, వాటిని ప్రస్తావించే నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, నిర్బంధ చర్యలను విరమించాలని దుర్గం దినకర్ కోరారు.






