15 June, 2026 | 11:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కుక్కల ఘటనపై సర్పంచుల్లో ఆందోళన

14-01-2026 07:06 PM

బయటకు ఎలా వచ్చిందని ఆరా..!

కామారెడ్డి,(విజయక్రాంతి): విష ప్రయోగంతో 600 కుక్కలను హతమార్చిన ఘటనలో మాచారెడ్డి మండలంలోని ఐదుగురు సర్పంచులపై  కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు కుక్కలపై విషప్రయోగం జరిగిన విషయాన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్​గా మారింది.

అయితే గ్రామాల్లో అంతర్గతంగా బయటకు పొక్కకుండా జరిగిన ఈ ఘటన ఫౌండేషన్ ప్రతినిధులకు ఎలా తెలిసిందన్న ప్రశ్నలు సర్పంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలను కుక్కల బెడద నుంచి కాపాడేందుకు చేసిన ఘటన ఒక్కసారిగా తమ మెడకు చుట్టుకోవడంతో ఆ సర్పంచులు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.