గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం
17-07-2026 08:09 PM
- ఆత్మహత్య కు ప్రయత్నించి చికిత్స పొందుతున్న యువకులు
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో ప్రదీప్, నవీన్ యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చేయని నేరానికి దాడులు చేశారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన ఇరువురు యువకులు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఒక్కొక్కరికి 30 వేల రూపాయల జరిమానా విధించారు. దీనికి మనస్థాపం చెందిన యువకులు ఎడపల్లి రైల్వే పట్టాలపై విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆత్మహత్యకు ప్రయత్నం గమనించిన స్థానికులు వీరిని బోధన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.






