25 July, 2026 | 1:59 AM

గీతం కళాశాలలో బీటెక్ విద్యార్థిని అదృశ్యం

25-07-2026 01:06 AM

పటాన్చెరు, జూలై 24 : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మునిసిపల్ పరిధిలోని రుద్రారం గీతం కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న హైదర్ నగర్ కు చెందిన విద్యార్థిని ఆశ్రిత (19) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం కళాశాల హాస్టల్లో ఉండే విద్యార్థినికి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, అనుమానంతో హాస్టల్ కు వచ్చి విచారించగా బుధవారం సాయంత్రం హాస్టల్ నుండి ఔటింగ్ కు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాలేదని చెప్పారు. దీంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.