13 July, 2026 | 5:18 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు

24-03-2026 12:57 AM
  1. సిరిసిల్ల, ములుగు కోర్టులకు మెయిల్ పంపిన ఆగంతకులు
  2. బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీ

రాజన్న సిరిసిల్ల/ములుగు, మార్చి 23 (విజయక్రాంతి): ములుగు, సిరిసిల్ల జిల్లా కోర్టులకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనం లో బాంబు అమర్చినట్లు తెలియజేస్తూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరిక పంపినట్లు సమాచారం. ఈ సందేశం అం దుకున్న వెంటనే కోర్టు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

సమాచారం అందు కున్న పోలీసులు తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకుని భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. జడ్జి, న్యాయవాదులు, సిబ్బంది, కేసుల కోసం వచ్చిన కక్షిదారులను వెంటనే బయటకు తరలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి కోర్టు భవనం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి మూలను పరిశీలిస్తూ అనుమానాస్పద వస్తువుల కోసం గాలించారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తులు ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.