24 April, 2026 | 12:21 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

సరస్వతి నిలయాలుగా బీసీ గురుకులాలు

18-02-2026 10:05 PM

ఆర్సిఓ శ్రీధర్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాలు సరస్వతి నిలయాలుగా నిలుస్తున్నాయని గురుకులాల సమన్వయకర్త శ్రీధర్ అన్నారు. బుధవారం మండలంలోని బాబాపూర్ లో గల బాలికల బీసీ గురుకుల పాఠశాల వార్షికోత్సవం, పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుకన్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.