డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం
27-04-2026 09:00 PM
దోమకొండ,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ బృందం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దోమకొండ మండలంలోని అంచనూర్, సంగమేశ్వర్, ముత్యంపేట గ్రామాలతో పాటు భిక్కనూర్ మండలంలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత దూరంగా ఉండాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, వివేకానంద యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపిక, కానిస్టేబుళ్లు నవీన్, విజయ్, శ్రీకాంత్, స్వప్న పాల్గొన్నారు.






