టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో నూతనంగా తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని ఏఐసీసీ విచారి విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తులఅరుణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే సాధ్యమైనంత త్వరలో మండల రెవెన్యూ కార్యాలయం నిర్మాణానికి నోచుకుంటుందన్నారు. ఆయన వెంట డిసిసి కార్యదర్శి లు లో ల పు పోశెట్టి చౌహన్ హరి సింగ్ నాతో పాటు సర్పంచులు గైక్వాడ్ శ్రీరామ్ లక్ష్మణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమన్న ఆత్మ డైరెక్టర్ ముందే శ్రీధర్ లతోపాటు కాంగ్రెస్ నాయకులు చెట్లపల్లి సుధీర్ కుమార్ జ్ఞానేశ్వర్ మడవి భీమ్రావు ప్రకాష్ పరశురాం లతోపాటు బిజెపి నాయకులు పోతన్నలు ఉన్నారు






