చర్లలో అంగన్వాడీల ధర్నా
06-06-2026 05:04 PM
ప్రీ ప్రైమరీ విద్య అంగన్వాడీల్లోనే కొనసాగించాలని డిమాండ్.
చర్ల,(విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చర్లలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. సిడిపిఓ, ఎమ్మార్వో, ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేశారు. సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారి మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తున్నారని, 4,000 అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
డిమాండ్లు:
ప్రీ ప్రైమరీ విద్య అంగన్వాడీల్లోనే కొనసాగించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, 1వ తేదీన రూ.18,000 జీతం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. డిమాండ్లు తీర్చకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






