అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం
పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పునస్కరించుకొని మంగళవారం ఉదయం పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మెయిన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీనగర్ డివిజన్లోని మ్యాక్ సొసైటీ ఈ ఎస్ ఐ రోడ్ మరియు మ్యాక్ సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ... సమానత్వం, సామాజిక న్యాయం కోసం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ గౌరవార్థం 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించిందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని మూసివేసి ఉంచడం బాధాకరమని అన్నారు.






