10-02-2026 12:38:19 AM
తాడ్వాయి, ఫిబ్రవరి, 9( విజయ క్రాంతి ): తాడ్వాయి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరను అందించాలని కోరారు.
రైతులు పండించిన సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్ రూపాయలు వెంటనే రైతుల ఖాతాల లో జమ చేయాలన్నారు. గతం లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం వెంటనే బాగు చేయాలని కోరారు.అనంతరం తహసీల్ధార్ కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.