ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచన
గోవిందరావుపేట, ఆగస్టు 25 (విజయ క్రాంతి): జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ పస్రా పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు.
25-08-2026 | 04:32pm