ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
మహాముత్తారం, సెప్టెంబర్ 02 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులపై పాలకులు, అధికారులకే నమ్మకం లేకపోతే పేదలు, రైతులు, కూలీలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
02-09-2026 | 03:47pm