3 September, 2026 | 8:32 PM

National -

article_25653194.webp
భారత్ సహా ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్

న్యూఢిల్లీ: భారత్-ఇరాన్ భేటీపై(India-Iran Meeting) అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ను కలిసిన నేపథ్యంలో ఇరాన్‌కు ఆయుధాలు సమకూర్చుకోవడంలో గానీ, అమెరికా ఆంక్షలను తప్పించుకోవడంలో గానీ సహాయం చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(US Secretary of State Marco Rubio) భారత్‌ తో సహా ఇతర దేశాలను హెచ్చరించారు. పెజెష్కియన్‌తో ప్రధాని సమావేశం గురించి, అలాగే టెహ్రాన్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి న్యూఢిల్లీ ప్రయత్నిస్తోందా అనే విషయంపై 'ది బ్రయాన్ కిల్మీడ్ షో'లో బ్రయాన్ కిల్మీడ్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు సాయం చేసే ఏదేశాలనూ వదలబోమని అమెరికా తేల్చిచెప్పింది.

03-09-2026 | 09:07am