వైఎస్సార్ చిరస్మరణీయుడు
చెన్నూర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్లో కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ, 108 వంటి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు, బలహీన వర్గాలకు సేవలందించారని కొనియాడారు. అనంతరం సత్యసాయి సేవా సమితి అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
02-09-2026 | 07:07pm