3 September, 2026 | 10:28 PM

Districts - Siddipet

article_50992059.webp
'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?

దళిత బంధు పథకానికి బదులుగా 'అంబేద్కర్ అభయహస్తం' పథకం కింద దళితులకు రూ.12లక్షలు అందిస్తామని చెప్పి, ఇప్పటివరకు కనీసం 12 మందికైనా ఆర్థిక సహాయం అందించారా? అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ముఖ్య సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు.

01-09-2026 | 11:13pm

article_68460842.webp
ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

సిద్దిపేట రూరల్,ఆగస్టు 30 (విజయక్రాంతి): ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి సహిత విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వంగ రాజేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా రూ.25 వేల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోడూరు మమతా రాజు, ఉపసర్పంచ్ అల్లం సాయి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

30-08-2026 | 03:25pm