3 September, 2026 | 10:12 PM

నవిపేట్‌లో బీఆర్ఎస్ రైతు ధర్నా: మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్

03-09-2026 | 09:11pm

బోధన్,(విజయక్రాంతి): నవిపేట్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్(Former MLA Shakil Aamir) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  నవిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విద్వాంసంలో భాగంగా నేడు రైతు ధర్నాలో పాల్గొన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ భారీగా రైతులు, బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా షకీల్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి 1000 రోజుల్లో రాష్ట్ర న్నీ సర్వ నాశనం చేశారు.

ఎన్నికల ముందు పెన్షన్ 2000,నుండి 4000 వికలాంగులకు 4000, నుండి 6000 ఇస్తామని చెప్పి ప్రజలకు మోసం చేసిండు, ఇక్కడి స్థానిక ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో భారీ వరదల వల్ల వేల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది.  సేవలు కానీ ఒక్క రైతు కు కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం ఇప్పించని దద్దమ్మ స్థానిక ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి,రైతులు చనిపోతే కేసీఆర్ 5 లక్షలు భీమా ఇస్తే దాన్ని మీరు అమలు చేయడం చేతకావడం లేదు,రైతులకు కరెంట్ కష్టాలు,సమయానికి ఎరువులు అందడం లేదు పనికి రాని యాప్ లతో రైతులను హరిగోసా పెడుతున్నారు. సుదర్శన్ రెడ్డి సీఎం బంధువు అంటావు నిధులు తేవడం మాత్రం చేత కాదు,ఇలాంటి నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.