3 September, 2026 | 9:50 PM

Breaking News

Districts - Medak

article_72934963.webp
గంజాయి విక్రయిస్తున్న యువకులను పట్టుకున్న పోలీసులు

తూప్రాన్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): తూప్రాన్‌లో 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. నేషనల్ హైవే-44పై నర్సాపూర్ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అలావుద్దీన్, లవకుష్‌లను తనిఖీ చేయగా గంజాయి లభించింది. వీరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా, శభాష్‌పల్లి ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయనున్నారనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.

02-09-2026 | 03:59pm