11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

జగదీశన్ సెంచరీ, తిలక్ వర్మ మెరుపులు

03-02-2026 01:12 AM

వార్మప్ మ్యాచ్‌లో యూఎస్‌ఏపై విజయం

టీ ట్వంటీ ప్రపంచకప్

బెంగళూరు, ఫిబ్రవరి 2 : టీ ట్వంటీ ప్రపంచకప్ ఫీవర్ మొదలైపోయింది. అసలు టోర్నీకి ముందు సన్నాహక మ్యాచ్ లు షురూ అయ్యాయి. టోర్నీలో ఆడుతున్న పలు జట్లు వార్మప్ మ్యాచ్‌లతో ప్రాక్టీస్ ను ఆరంభించాయి. ఈ క్రమంలో యూఎస్‌ఏతో భారత్ ఏ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ జట్టులో వరల్ కప్ ఆడబోతున్న తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో పలువురు యువ ఆటగాళ్లకు కూడా చోటు దక్కింది. సెలక్టర్ల దృష్టిలో పడాలన్నలక్ష్యంతో భారత్ ఏ జట్టు అదరగొట్టింది. అయితే తిలక్ వర్మ కూడా రీఎంట్ట్రీలో మెరుపులు మెరిపించాడు.

దేశవాళీ క్రికెట్ ఆడుతుండగా గాయపడి సర్జరీ తర్వాత కోలుకున్న తిలక్ వర్మ ఇటీవలే బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో మెగాటోర్నీకి ముందు పూర్తిస్థాయిలో అతను ఫిట్ గా ఉన్నాడా లేదా అన్నది తెలుసుకునేందుకు, ప్రాక్టీస్ కోసం సెలక్టర్లు అమెరికాతో మ్యాచ్ లో బరిలోకి దింపారు. వన్‌డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు.

క్రీజులో ఉన్నంతసేపు తన సహజమైన బ్యాటింగ్‌తో పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఫిట్‌నెస్ పరంగానూ, బ్యాటింగ్ పరంగా తిలక్ ఎటువంటి ఇబ్బందీ పడలేదు. అంతేకాదు బౌలింగ్ లోనూ రాణించి ఒక వికెట్ తీశాడు. భారత్ ఏ జట్టును ప్రకటించినప్పుడు తిలక్ వర్మ టీమిండియా క్యాంపులో చేరే ముందు ఒక మ్యాచ్ ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారమే మ్యాచ్ ఆడి టచ్‌లోకి వచ్చేశాడు. తిలక్ వర్మ రానుండడంతో సంజూ లేదా ఇషాన్ కిషన్ లలో ఒకరిపై వేటు పడనుంది. ఇదిలా ఉంటే ఈ వార్మప్ మ్యాచ్ లో జగదీశన్ నారాయణన్ సెంచరీతో దుమ్మురేపాడు.

యూఎస్‌ఏ బౌలర్లపై విరుచుకుపడిన జగదీశన్ 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అతనితో పాటు ఆయుశ్ బదోని కూడా అదరగొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఏ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఛేజింగ్ లో యూఎస్‌ఏ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ గౌస్ 44, సంజయ్ కృష్ణమూర్తి 41 పరుగులతో రాణించారు. ధాటిగా ఆడినప్పటకీ యూఎస్‌ఏ 200 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టాడు. నమన్ ధీర్ 2, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.  భారత్ ఏ జట్టు తన చివరి వార్మప్ మ్యాచ్ లో శుక్రవారం నమీబియాతో తలపడుతుంది.