11 May, 2026 | 10:13 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

28-11-2025 10:32 PM

రేగొండ,(విజయక్రాంతి): అతివేగంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మూర దేశపతి (28) తన స్నేహితుడు రాజ్ కుమార్ తో కలిసి ములుగు జిల్లాకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి గోరి స్మశాన వాటిక దగ్గర గల మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు గుద్దుకొని స్పాట్ లోనే చనిపోయినట్లు వారు తెలిపారు. తన స్నేహితుడు రాజ్ కుమార్ కు తలకు గాయాలై చేతి విరగడంతో వెంటనే స్థానికులు పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కొత్తపల్లి గోరి మండల పోలీసులు తెలిపారు.