23 April, 2026 | 2:19 AM

పోపా అధ్యక్షుడిగా యోగేశ్వర్ ఎన్నిక

23-04-2026 12:54 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా  పద్మశాలి ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ (పోపా) అధ్యక్షుడిగా రిటైర్డ్ తహసిల్దార్ కూర్మ యోగేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అనుమాల సిద్ధార్థ్ ను నియమిం చారు. బుధవారం అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్ర రావు, సంగారెడ్డి అధ్యక్షులు కొప్పెరి హరి హర కిషన్, కార్యదర్శి సోమ రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పద్మశాలి కుల బాంధవుల ఆలోచనలను వ్యక్తపరుస్తూ సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలని పద్మశాలి సంఘం సన్నాహక సమావేశం, మండల కమిటీల ఏర్పాటు ఏకాభిప్రాయంతో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులు అనుమాల వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాల సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామల నరసయ్య, కోశాధికారి బొమ్మ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాస్, మార్కండేయ గుడి అధ్యక్షులు కైరం కొండ వీరన్న, కూరపాటి ఆదినారాయణ పాల్గొన్నారు.