వంట చేస్తుండగా మహిళకు తీవ్ర గాయాలు
29-05-2026 02:04 AM
బోధన్ మే 28 (విజయక్రాంతి): సాలూర మండలంలో గురువారం ఓ మహిళకు ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. సాలూరకు చెందిన ఆరీఫాబేగం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు దీపం తనపై పడటంతో తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు 108లో బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.






