29 August, 2026 | 12:36 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

ప్రజారోగ్యాన్ని కాపాడతాం

19-04-2026 12:41 AM
  1. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాం
  2. ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి

వరంగల్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీరు అందించడం అత్యంత అవసరమని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మ న్, బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు శనివారం వరంగల్‌లోని రాయపర్తి మండలం జయరాం తండా (ఎస్) గ్రామంలో వాటర్‌ఫ్లాంట్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండా ప్రజలు తాగునీటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పా రు.

ప్రజాప్రయోజనార్థం ఉచిత మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపా రు. ఐఐటీ ఖరగ్‌పూర్ హైదరాబాద్, కృషి విజ్ఞాన్‌కేంద్ర మామునూర్ సంస్థలు వాటర్ ప్లాంట్ యంత్రాన్ని అందించగా, వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన గది నిర్మాణాన్ని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చేపట్టిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ సేవాకార్యక్రమాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.