30 June, 2026 | 10:30 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గీత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తాం

03-11-2025 05:09 PM

మోకు దెబ్బ జిల్లా సంఘం అధ్యక్షులు చేపూరి కనకా గౌడ్ 

కుభీర్ మండల గీత కార్మికుల సమావేశంలో సన్మానం 

కుభీర్ (విజయక్రాంతి): గీత కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని జిల్లా సంఘం అధ్యక్షులు చేపూరి కనుక గౌడ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో సోమవారం మండలంలోని ఆయా గ్రామాల గీత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, పెన్షన్లు రానివారు ఎందరో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు.

చెట్లు గీయనిదే పూట గడవని పరిస్థితిలో ఎందరో గౌండ్లు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సాధించుకునేందుకు గీత కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి జి. మురళి గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముష్కం అశోక్ గౌడ్, జిల్లా అధ్యక్షులు చేపూరి కనకా గౌడ్ లను గౌడ కులస్తులు, గీత కార్మికులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గౌడ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు.