23 June, 2026 | 7:15 PM

Breaking News

చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •   రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి   •  

రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి

23-06-2026 05:39 PM

ఖమ్మం రూరల్,(విజయక్రాంతి): రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని, ఖరీఫ్ రైతు భరోసా నిధులను ఒకే దఫాలో విడుదల చేయాలని కోరారు. పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించి, నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రూపాయలకు పైబడిన వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వో వినయేందర్ రెడ్డికి అందజేశారు.