23 June, 2026 | 8:13 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ

23-06-2026 07:01 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండలంలోని ఎంపీపీఎస్ వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశాజ్యోతి సేవా సంస్థ, సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సేవా సంస్థ ప్రతినిధులు కోనా మోహనరావు, కుడుముల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, ఒక జత దుస్తులను గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రి వెంకటేశ్వరరావు, మండల కెమిస్ట్రీ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి సుధాకర్ రెడ్డి, వేముల వెంకటేశ్వరరావు, పారిశుద్ధ్య కార్మికురాలు గౌర్రాజు లక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.