10-02-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: విద్యార్థులు సాంకేతికతకు బానిసలు కాకుండా, టెక్నాలజీపై పట్టు సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించుకోవాలన్నారు. మం చిగా పరీక్షలు రాయడానికి గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలని, తగినంత నిద్రపోవాలని మోదీ స్పష్టంచేశారు.
కోయంబత్తూరు, రాయ్పూర్, గౌహతి, గుజరాత్లో జరిగిన విద్యార్థులతో పరీక్షా పే చర్చ రెండో కార్యక్రమంలో ప్రదాని మోదీ సోమవారం మాట్లాడారు. కొంతమంది పిల్లలకు మొబైల్ ఫోన్లు యజమానులుగా మారాయని, వీటితోపాటు టెలివిజన్ స్క్రీన్స్ను చూడకుండా వారు ఆహారం కూడా తినలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త సాంకేతిక తలకు భయపడకుండా, వాటిని నోర్చుకుని, వాటి నైపుణ్యాల్లో రాటుదేలాలన్నారు. ‘పరీక్షలకు బాగా సిద్ధమైతే మీరు ఎప్పుడూ ఒత్తిడికి గురికారని, రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే రోజంతా ఉల్లాసంగా ఉంటారని మోదీ చెప్పారు. దేశంలోని 10,12వ తరగతి విద్యార్థులు కూడా వికసిత భారత్ 2047 కలను తమ మనసుల్లో మోయగలగడం చూసి తనకు చాలా సంతోషమేసిందన్నారు. ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ అలవరుచకోవాలని పిలుపునిచ్చారు.