05-02-2026 03:42:51 PM
ఖమ్మంపల్లిలో దగ్గరుండి మురుకి కాలువలు, రోడ్డు శుభ్రం చేస్తున్న వార్డు సభ్యురాలు వేల్పుల మనేశ్వరి
ముత్తారం,(విజయక్రాంతి): శభాష్ వార్డ్ మెంబర్ అనిపించుకుంటున్నారు. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ లోని 6 వార్డులో దగ్గరుండి వార్డు సభ్యురాలు వేల్పుల మనేశ్వరి, శ్రీశైలం యాదవ్ మురుకి కాలువలు, రోడ్డు శుభ్రం చేయిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో గ్రామపంచాయతీలో ఎక్కడ వేసిన చెత్త అక్కడనే పేరుకుపోతుండటంతో ప్రజలు త్రీడీ ఇబ్బందులు పడుతున్నారు. వార్డు సభ్యులుగా ఇటీవల వార్డు సభ్యులుగా ఎన్నికైన మనేశ్వరి శ్రీశైలం యాదవ్ దగ్గరుండి వార్డులోని మురికి కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ వీధిలైట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు.