30 June, 2026 | 11:51 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్

17-04-2026 11:15 AM

న్యూఢిల్లీ: మహిళల రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై(Delimitation Bills) లోక్ సభలో శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై సాయంత్రం 4 గంటలకు లోక్ సభలో ఓటింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజారిటీయే అవసరం అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింటి రెండొంతుల మెజారిటీ అవసరం అన్నారు. బిల్లు ఆమోదానికి ప్రస్తుతం లోక్ సభ(Lok Sabha) సభ్యుల్లో 2/3 మోజారిటీ అవసరం. బిల్లు ఆమోదానికి లోక్ సభలో 360 మంది సభ్యల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది.

సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు మోజారిటీ సాధిస్తూ చాలు బిల్లు పాస్ అవుతోంది. ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే సభలో అధికార పక్షానికి బలం చేకూరుతోంది. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్షాలు వెల్లడించాయి. డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ పూర్తి వివరాలు వెల్లడిస్తామని అమిత్ షా( Amit Shah) చెబుతున్నారు. 50 శాతం పెంపుతో లోక్ సభ సీట్లు 816కు పెరగనున్నాయి. లోక్ సభ సీట్లు తెలంగాణలో 26కు, తమిళనాడులో 59 కు పెరగనున్నాయి. డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు(Opposition) దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల బలం పెరుగుతుందని అమిత్ షా వివరించారు.