20 June, 2026 | 7:13 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

విశ్వజనని సేవా రత్న అవార్డు

01-11-2025 07:48 PM

కోదాడ: హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని  విశ్వజనని ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకల్లో సమాచార హక్కు సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ళపల్లి లక్ష్మణ్ విశ్వజనని సేవారత్న అవార్డును తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ దేశాల భూపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. లక్ష్మణ్ శనివారం మాట్లాడుతూ, సమాజంలో సేవలు చేసే వారిని గుర్తించి, అవార్డు రూపంలో ప్రోత్సహించడం వారి సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సహకంగా ఉంటుందని, ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు సందర్భంగా లక్ష్మణ్ కు పలువురు నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు అభినందనలు తెలిపారు