మళ్లీ వేధిస్తున్న యూరియా కొరత
- నిజామాబాద్ జిల్లా ఏరాజ్పల్లిలో విక్రయ కేంద్రం వద్ద రైతుల ధర్నా
- పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం
నిజామాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి): రాష్ట్రంలో పలు చోట్ల యూరియా కొరత రైతులను వేధిస్తున్నది. యూరియా సకాలం లో అందకపోవడంతో గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఏరాజ్ప ల్లిలో ఎరువుల విక్రయ కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. సరైన సమయంలో ప్రభుత్వం యూరియా అందించడం లేదం టూ ఎరువుల కేంద్రం వద్ద ధర్నా నిర్వహించా రు.
యూరియా సరిగ్గా సరఫరా చేయడం లేద ని, యూరియాను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు యూరియా సరఫరా చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వేదన వ్యక్తం చేశారు. గతంలో సరఫరా చేసిన విధంగానే పంపిణీ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.




