“మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు
10-05-2026 11:28 AM
హైదరాబాద్: మాతృ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాతృమూర్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మను సృష్టికి మూలం, ప్రతి ఇంటా కొలువై ఉండే దైవం, మన తొలి గురువు అని అభివర్ణించారు. అప్యాయత, ఓర్పు, సహనం, శాంతి, శక్తికి ప్రతిరూపం అమ్మ అని ముఖ్యమంత్రి కొనియాడారు. జీవితంలో వెలుగులు నింపే అమ్మ ప్రేమ, సేవ, త్యాగం అమూల్యం, అనిర్వచనీయం. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సీఎం రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికల ద్వారా తెలిపారు.






