27 August, 2026 | 11:09 PM

Breaking News

ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి   •   జూనోని పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్‌ అలీ   •   రైతులకు శాశ్వత డిజిటల్ భూ రికార్డు సర్వే   •   జవాబు చెప్తే బెస్ట్ గిఫ్ట్ పెన్ను బుక్కు   •   గణపురంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక   •   కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే   •   పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు   •   ఇండ్ల స్థలాలకోసం జర్నలిస్టుల పాదయాత్ర బాధాకరం   •   గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు   •  

మల్లారెడ్డి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

27-08-2026 09:37 PM

వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపన గండ్ల మండలంలోని బొల్లారం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు కామ్రేడ్‌ కృష్ణయ్య మాట్లాడుతూ రైతుల సమస్యలు, హక్కుల కోసం మల్లారెడ్డి నిరంతరం పోరాటం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ మధు సతీమణి కామ్రేడ్‌ సుమతి మృతికి నాయకులు సంతాపం తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం ఆమె చేసిన కృషిని కొనియాడుతూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల నాయకులు వి. కృష్ణయ్య, వై. నాగరాజు, వి. తిరుపతయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.