చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ మృతి
27-02-2026 01:02 AM
చేగుంట, ఫిబ్రవరి 26: చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాసాయిపేట్ మండలం బొమ్మారం గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు(36) ట్రాక్టర్ పై రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లై చేస్తుండగా బుధవారం ప్రమాదవశాత్తు టాక్టరు, ట్యాంకర్ బోల్తాపడింది. బలమైన గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని తండ్రి మట్టెల నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.




