15-02-2026 05:18:22 PM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ మహా శివరాత్రి జాతర, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం రేపటి ఈ నెల 16వ తేదీ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అధికారులు అందరూ వేములవాడ మహా శివరాత్రి జాతర, ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.