05-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టి వాగు గబ్బిలాల మడు గు, సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు సందర్భంగా బుధవారం తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. ఆదివాసి పూజారులు గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. తెలుగు వారం పండగ వేడుకలో ఆదివాసి పూజారులు దారం సిద్దు, జాతర కమిటీ అధ్యక్షుడు కారం లక్ష్మయ్య ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు వన దేవతలకు బోనాలతో తరలివచ్చి నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున తిరుగు వారం వేడుకకు భక్తులు హాజరయ్యారు.