ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్
14-07-2026 03:23 PM
తాండూరు,(విజయక్రాంతి): జులై 24వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని వికారాబాద్ పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ సర్పంచ్ ఆనంద్ నాయక్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి నవిత సర్ భాగంగా ఓటర్లకు ఇచ్చిన ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో 850 ఓట్లకు గాను కేవలం 300 ఓటర్లు మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారని మిగతావారు త్వరగా పూర్తి చేసి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో కందనెల్లి తాండ GPO శివవ్య, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు






