సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన
పెద్దపెల్లి జిల్లా బియ్యం మాత్రమే దించుకోవాలి
వేరే జిల్లాల బియ్యం ఇక్కడ దించవద్దు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పక్కన గల పెగ్గు గోదాంల వద్ద మంగళవారం రైస్ మిల్లర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భం గా గోదాం అధికరికి వినతి పత్రం అందజేశారు. ఇక్కడి గోదాంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బియ్యం మాత్రమే దించుకోవాలని, వేరే జిల్లాల కు సంబంధించి ఇక్కడ బియ్యం దించడం వలన తాము తీవ్ర ఇబ్బందిగా గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా 140 రైస్ మిల్లులు ఉన్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కామన్ గా చేయటంతో , తాము మూడోవంతు కూడా బియ్యం దించలేకపోతున్నామని అన్నారు. ఈ విషయమై ఎఫ్సీఐ అధికారులతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని వెంటనే అధికారులు స్పందించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాత్రమే బియ్యం దించుకోవాలని, ఇతర జిల్లాల బియ్యం ఇక్కడ దిస్తే ఆందోళన చేపట్టడం జరుగుతుందని రైస్ మిల్ వ్యాపారులు అన్నారు. ఇందులో పెద్ద ఎత్తున రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.






