మామిడికాయల లారీ బోల్తా: ముగ్గురికి గాయాలు
07-05-2026 03:53 PM
కోహెడ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో మామిడి కాయల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. హుస్నాబాద్ నుండి కరీంనగర్ మీదుగా వెస్ట్ బెంగాల్ కు మామిడికాయల లోడ్ తో వెళ్తుండగా వేకువ జామున డీసీఎం వ్యాన్ బోల్తా పడ్డట్లు స్థానికులు తెలిపారు. వ్యాన్ లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ బోల్తా పడడంతో వ్యాన్ లో ఉన్న మామిడి కాయలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు మామిడికాయలను తీసుకెళ్లారు.






