28 June, 2026 | 2:37 PM

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్

28-06-2026 01:38 PM

26వ డివిజన్‌లో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్

ముకరంపుర,(విజయక్రాంతి): పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా 26వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్  స్థానిక సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, టీఎన్‌ఆర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్  స్వయంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.

5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.