పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి
28-06-2026 01:18 PM
వెల్దుర్తి,(విజయక్రాంతి): పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా వెల్దుర్తి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మెదక్ డిఎంహెచ్ఓతో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన సునీత లక్ష్మారెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.






