ఉర్దూ మీడియం విద్యార్థికి ఖానాపూర్ ఎమ్మెల్యే సన్మానం
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నుంచి ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఉర్దూ మీడియం జిల్లా టాపర్గా మార్కులు సాధించిన సయ్యద్ మదీహ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సన్మానించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమెను ఎమ్మెల్యే సన్మానించారు. జిల్లా స్థాయిలో ఉర్దూ మీడియం లో 555 మార్కులు సాధించి కాపర్ గా నిలిచిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు .విద్యార్థినిని శాలువాతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి సయ్యద్ అయూబ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ షబ్బీర్ ష ,కౌన్సిలర్ గొర్రె గంగాధర్, నాయకులు అవమానుల్లా ఖాన్, జన్నారపు శంకర్ ,చరణ్ ,శేషాద్రి, తదితరులు ఉన్నారు.






