19 May, 2026 | 11:26 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ప్రతిభను వెలికి తీయడానికే టోర్నమెంట్

08-01-2026 12:06 AM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జనవరి 7 (విజయక్రాంతి): యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ప్రతి ఏడాది రాజీవ్ గాంధీ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాం గ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. రాజీవ్ గాంధీ ఆలిండియా అండర్ 19 టీ-20 క్రికెట్ చాంపియన్ షిప్ 2026 కు మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంత రావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి బుధవారం హాజరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్ర మంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరయ్యారని ఎమ్మెల్యే తెలిపారు.