మంత్రి ఆదేశంతో సర్వే ప్రారంభం
24-08-2026 06:01 PM
నిర్మల్ ఆగస్టు 24 ( విజయ క్రాంతి): రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మణ చందా మండల హెడ్ క్వార్టర్ ఊరు మధ్యలో డబల్ లైన్ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు సర్వే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆర్ అండ్ బి AE అంజనేశ్వర్ కొలతలు చేసి చేపట్టవలసిన అభివృద్ధి పనుల నివేదికను పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ పార్ పెళ్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి మండల మైనార్టీ అధ్యక్షుడు అజ్గర్ బొజ్జ రవి మల్లేష్ నగేష్ రవి కల్లెడ భూమన్న వెంకటి వినేష్ వడ్యాల్ ఉప సర్పంచ్ రవీందర్ ఆత్మ డైరెక్టర్ కిరణ్ సింగ్ ఠాకూర్ గ్రామస్తులు పాల్గొన్నారు






