సునంద రైస్ మిల్లును శాశ్వత నిషేధం విధించాలి
ప్రజల ఆరోగ్యం భద్రత ప్రమాణాలను పాటించాలి
ఎమ్మార్పీఎస్ నాయకులు కొత్తపల్లి రవి
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రజావాసాల మధ్య నిర్వహిస్తున్న సునంద రైస్ మిల్లుకు తిరిగి అనుమతులు ఇవ్వకుండా శాశ్వత నిషేధం విధించాలని ఎమ్మార్పీఎస్ గరిడేపల్లి మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో ఆర్. సరోజకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లు వల్ల కాలుష్యం, దుమ్ము, శబ్దం తదితర సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గతంలో అధికారుల తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు, విజిలెన్స్ అధికారులు ఎన్ఫోర్మేంట్ అధికారుల సంయుక్త దాడులలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని మిల్లుకు పునఃప్రారంభ అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అధికారులు స్పందించకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.






