ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
ఆర్సీబీ, సన్ రైజర్స్ మధ్య ఆరంభ మ్యాచ్
20 మ్యాచ్లతో తొలి దశ షెడ్యూల్
ముంబై , మార్చి 11: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెం గళూరు(ఆర్సీబీ)తో మన సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) తలపడనుంది. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా 20 మ్యాచ్ల షెడ్యూల్నే బీసీసీఐ విడుదల చేసింది. బెంగళూరు, ముంబై, గువహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వేదికగా ఈ 20 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లు 03:30 గంటలకు, రాత్రి మ్యాచ్లు 07:30 గంటలకు ప్రారంభమవుతాయి.




