గాయాలే అసలు సమస్య
- లంక టూర్కు జట్టు ఎంపిక నేడే
- సుందర్ ఔట్, బుమ్రా డౌట్
- గుర్నూర్ బ్రార్కు చోటు దక్కే ఛాన్స్
ముంబై, జూలై 27: టీమిండియా జింబా బ్వే టూర్ ముగిసింది. టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత జట్టుకు ఇప్పుడు 20 రో జుల రెస్ట్ దొరికింది. భారత క్రికెట్ జట్టు తర్వాత శ్రీలంక టూర్కు వెళ్లబోతోంది. వచ్చే నెల 15 నుంచి శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ఈ సారి జట్టు ఎంపిక సెలక్షన్ కమి టీకి తలనొప్పిగా మారింది. డబ్ల్యూటీసీ 2026- టీమిండియాకు కీలకంగా మారిన లంకతో టెస్ట్ సిరీస్ కు పలువురు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు.
స్టార్ పేసర్ బుమ్రా గాయంతో పడుతుండగా, వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ మధ్యలోనే బుమ్రా గాయపడ్డాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో అతన్ని ఎంపిక చే స్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ బుమ్రా దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలననేది సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన గుర్నూర్ బ్రార్ను తీసుకునే అవకాశ ముంది.
అఫ్గానిస్తాన్ తో వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్లో ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు బుమ్రా దూర మైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ కృష్ణలపైనే పేస్ భారం పడనుంది. కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ పైనా అనుమానాలున్నాయి. హర్షిత్ రాణా సైతం గాయంతో బాధపడుతున్నాడు. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో సెలక్టర్ల ముందు యువ ఆటగాళ్లే ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నారు.
కానీ శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించేందుకు పూర్తి యువ ఆటగాళ్లే సరిపోరు. సీనియర్లు సైతం భాగం కావాల్సిందే. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్లో కోహ్లి, అశ్విన్తో పాటు పుజారా ఆడారు. అప్పుడు ఆతిథ్య లంక జట్టును వైట్వాష్ చేసింది. తాజాగా శుభమన్ గిల్ సారథ్యంలోని భారత్ శ్రీలంకపై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరగనున్నాయి.






