27 February, 2026 | 2:46 PM

పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

27-02-2026 01:00 AM

కాగజ్‌నగర్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి): మండలంలోని మోసం గ్రామంలో గ్రామదేవత పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ కార్యక్రమా న్ని పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పరమాదేవి దంపతులు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అన్నదానం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమన్కార్ పద్మ వసంత్రావు, ఉప సర్పంచ్ రోహిణి పుష్పలత రామయ్య, మాజీ సర్పంచ్ కునుషోత్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రౌతు సంతోష్, వార్డ్ సభ్యులు అంబిలపు గురు, కునుషోత్ దేవయ్య, రమేష్, సత్యన్న, పిప్పిరె పురుషోత్తం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.