23 April, 2026 | 11:25 AM

కాలేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక చెత్తబుట్టలో వేయాలి

23-04-2026 12:22 AM

బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, ఏప్రిల్ 22: కాలేశ్వరం ప్రాజెక్టుపై పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేయాల్సిందేనని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాలేశ్వరం పై అవినీతి ఆరోపణలు అసత్యమని, కమిషన్ నివేదిక ఫేక్ అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలమైందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.